2005-03-28

యాది

8/25/02
వార్త లో సదాశివ గారు -తెలుగు, ఉర్దూ పండితులు, సంగీతజ్ఞులూ- రాస్తున్న ఈ కాలమ్ లోని తెలంగాణావమానాలు చదువుతూంటే (ఆయనని అయిదో తరగతి తెలుగు వాచకాన్ని కూర్చమని అడిగిన వైనమూ - నిజామాబాద్ ఊరి వాడనీ, తెలుగు సరిగా రాదేమోననీ అనుమానంగా చూసిన విధమూ..) ఉద్యమం అని మనమనుకునే వన్నీ ఎక్కడో చిన్న చిన్న వైయుక్తిక స్థాయి సమస్యలు గా ఎలా మొదలవుతున్నాయో స్పష్టంగా నే కనబడుతోంది. ఇలాంటి అనేక సంఘటనలు వేల జీవితాలలో జరగడం- వాటి ప్రభావమంతా కలసి కొంత మంది లో కేంద్రీకృతమై ప్రత్యేక ఉద్యమాలు సంభవించడం - ఇంకొన్ని లక్షల కోట్ల జీవితాలు వాటి వల్ల ప్రభావితం కావడం…
అయినా ఇదంతా అంత సులభమైన వ్యవహారం కాదు - నదీ జలాలూ, డాములూ, బజెట్ అల్లొకేషన్ - ఇవన్నీ వ్యక్తిగత వ్యవహారాలు కావు అనుకోవచ్చు. కానీ ఇవి కూడా సమస్యలు గా పరిణమించింది ఎవరో మనలాంటి మనుషుల (నాయకులనే పేరు తో) ఈగో లవల్లా, అవగాహనా రాహిత్యంవల్లా పరిష్కారాల పట్ల నిజమైన ప్రేమ లేకపోవడం వల్ల నే.. సరే దురాశా, గ్రీడ్, అవినీతు ల సంగతి చెప్పనే అక్కరలేదు.
బలవంతుడు - తెల్లవాడో ఇంకెవడో - అసలు వివక్షత చూపించక పోతే - స్వాతంత్ర్యం అనేది ఏమిటి ? అందరూ వ్యక్తిగతానికున్న ప్రాముఖ్యతని అర్ధంచేసుకుంటే దురాక్రమణ అనే పదం ఎలా పుడుతుంది ? మనుషులందరూ నిజంగా వివేకవంతులయితే అసలు "ప్రభుత్వం" అనేదే అవసరంలేదంటున్నారెవరో.